ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘పవన్ మాల’ పేరిట దీక్ష..వినూత్నంగా వ్యవహరిస్తున్న పవన్ అభిమానులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 19, 2022, 09:36 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు ‘పవన్ మాల’ పేరిట దీక్ష స్వీకరించారు. పాలకొల్లుకు చెందిన యువకులు పవన్ మాల ధరించారు. ఇదిలావుంటే  మండలం రోజులపాటు కఠిన నియమాలు పాటిస్తూ.. దైవ చింతనతో గడపడం కోసం భక్తులు మాలధారణ చేస్తారు. దక్షిణాదిలో అయ్యప్ప మాలకు ఎంతో విశిష్టత ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు ఏటా అయ్యప్పమాల వేసుకుంటారు. నలుపు రంగు వస్త్రాలు ధరించి.. 41 రోజులపాటు నిష్టగా పూజలు చేసి.. శబరిమల వెళ్లి హరిహరసుతుణ్ని దర్శించుకొని వస్తారు. అయ్యప్ప మాలతోపాటు.. భవానీ దీక్ష, శివ మాల, వేంకటేశ్వర స్వామి మాల, హనుమాన్ దీక్షను కూడా చాలా మంది భక్తులు చేపడుతుంటారు.


కానీ ఇప్పుడు తెలుగు నాట మరో ట్రెండ్ మొదలైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు ‘పవన్ మాల’ పేరిట దీక్ష స్వీకరించారు. మెడలో ఎర్ర కండువా ధరించి 49 రోజుల దీక్షను మొదలుపెట్టారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అనే సంగతి తెలిసిందే. ఇది ఆయన 49వ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ మాలధారణ చేసిన ఆయన అభిమానులు 49 రోజులపాటు దీక్ష చేస్తున్నారు.


పాలకొల్లుకు చెందిన యువకులు పవన్ మాల ధరించారు. వీరంతా మెడలో ఎర్ర కండువాలు ధరించారు. జనసేనాని ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ 49 రోజులు ప్రయత్నిస్తామని వారు చెప్పారు. పవన్ అభిమానులకు దూకుడు ఎక్కువ అనే పేరుంది. కానీ పవన్ మాలధారణ చేసిన వీళ్లంతా.. ఆ అభిప్రాయాన్ని మార్చే దిశగా ప్రయత్నిస్తున్నారు. తమ వల్ల పవన్ కళ్యాణ్‌కు మంచి పేరు వచ్చేలా చూస్తామంటున్నారు.


పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ మాల వేసుకోవడం ఇదే తొలిసారి కాదు. 2019లోనూ ఆయన అభిమానులు మాలధారణ చేశారు. సంప్రదాయ వస్త్రధారణ, మెడలో ఎర్ర కండువా, మెడలో రుద్రాక్ష మాల, భుజాన జనసేన జెండాతో.. కాళ్లకు చెప్పులు లేకుండా.. వారు దీక్షను విరమించారు. అన్ని మతాలకు చెందిన దేవుళ్ల ఫొటోల మధ్య పవన్ కళ్యాణ్ ఫొటో ఉంచి జనసేనానిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.


ఇదిలా ఉంచితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సైతం భక్తిప్రతులు ఎక్కువనే సంగతి తెలిసిందే. 20 ఏళ్లుగా చాతుర్మాస్య దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది కూడా గత నెలారంభంలో చాతుర్మాస్య దీక్షను ప్రారంభించారు. ఆషాడం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ మాసాల్లో పవన్ ఈ దీక్ష చేపడుతున్నారు. ఈ దీక్షలో ఉన్నంత కాలం పవన్ ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకుంటారు. అది కూడా సాత్వికాహారమే తీసుకుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com