భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రాజెక్టులు నీటి మట్టంతో నిండిపోయాయి. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి, కృష్ణా నదులకు వరద వచ్చే అవకాశం ఉందని, ప్రజలతో పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.