ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముక్కాంవద్ద హ‍ుదూద్ తరహా అలలు...వణికిన జనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 09:44 PM

హుదూద్ తుఫాను భీభత్సం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. తాజాగా మరసారి ఏపీలో అలాంటి అలలు కనిపించాయి. ఏపీలో సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం దగ్గర అలలు ఎగసిపడుతున్నాయి. తీరంలో ఐదు మీటర్లు ఎత్తున కెరటాలు ఎగసిపడుతున్నాయి. సుమారు 150 మీటర్ల ముందుకు సముద్రం చొచ్చుకొచ్చింది. అలల తాకిడికి తీరం వెంబడి ఉన్న రోడ్లు ధ్వంసం అయ్యాయి. హుదూద్ తుఫాన్ తర్వాత మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో అలలు విరుచుకుపడుతున్నాయి.


మరోవైపు కాకినాడ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉప్పాడ-కాకినాడ తీరంపై వాయుగుడం ప్రభావం కనిపిస్తోంది. సముద్ర తీరంలో విభిన్న పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఉప్పాడ బీచ్ రోడ్డుపై భారీగా అలలు ఎగసిపడుతున్నాయి. బీచ్ రోడ్డులో ప్రయాణిస్తున్న వాహనాలపై కెరటాలు ఎగిరిపడుతున్నాయి. మరోవైపు కాకినాడ కుంభాభిషేకం రేవు దగ్గర సముద్రం వెనక్కి వెళ్లింది. వాయుగుడం కారణంగా గత మూడు రోజులుగా తీరానికే మత్స్యకారులు పరిమితం అయ్యారు.


మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశాను ఆనుకుని కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణశాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా చత్తీస్‌గఢ్‌ వైపు పయనించి 24 గంటల్లో నెమ్మదిగా బలహీనపడుతూ భూమి మీదకు ప్రవేశిస్తుందన్నారు. ఈ ప్రభావంతో మంగళవారం కోస్తా జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. బుధవారం నుంచి వర్షాలు అక్కడక్కడా తప్ప చాలా ప్రాంతాల్లో తగ్గుముఖం పడతాయి అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com