ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీ కమిటీలకు సంబంధించి నూతన విధానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 07, 2022, 03:20 PM

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ప్లీనరీ ఘనవిజయం చూసిన తర్వాత చంద్రబాబు వెక్కి వెక్కి ఏడుస్తాడ‌ని పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ప్లీనరీని అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్నామని అన్నారు. గురువారం తాడేప‌ల్లిలోని పార్టీ  కేంద్ర కార్యాలయంలో విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ.. 'ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఎంతో నిర్మాణాత్మకంగా వ్యవహరించాం. అదికారంలోకి వచ్చాక కూడా అంతే నిర్మాణాత్మకంగా వ్యవహరించాము. సామాజిక న్యాయం దిశగా అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చాం. ప్లీనరీ విజయవంతం అవుతుందనడంలో ఎటువంటి అనుమానం లేదు. శుక్రవారం 1.50 లక్షల మంది, రెండో రోజు 4 లక్షల మంది వస్తారని అంచనా.  పార్టీ కమిటీలకు సంబంధించి రేపటి రోజున అధ్యక్షులు ఒక నూతన విధానం ప్రకటిస్తారు. పార్టీని మరింత పటిష్టం చేసుకుని రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతాం​' అని విజయసాయిరెడ్డి‍ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com