ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఫేక్ నోట్ లు ఎక్కడినుంచి పుట్టుకొస్తున్నాయి..టీడీపీలో అంతర్మథనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 06, 2022, 02:37 PM

టీడీపీకి ఇటీవల ఫేక్ ప్రెస్ నోట్ ల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. తన ప్రమేయంలేకుండానే తప్పుడు సమాచారం జనంలోకి వెళ్తోందన్న ఆందోళన ఆ పార్టీలో నెలకొంది. ఇదిలావుంటే టీడీపీని సోషల్ మీడియాలో వరుసగా ఫేక్‌ల బెడద వెంటాడుతోంది. కొద్దిరోజులుగా టీడీపీ ప్రెస్‌నోట్‌లు, ట్వీట్ల పేరుతో కొన్ని వైరల్ అవుతున్నాయి. వీటిపై తీరా ఆరా తీస్తే అవి ఫేక్ అని తేలుతోంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరుతో మరో ఫేక్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ అధికారంలోకి రాగానే సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలను రద్దు చేస్తామన్నది ట్వీట్ సారాంశంగా ఉంది.


‘టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టి, ఈ జగన్‌ రెడ్డి సృష్టించిన వాలంటీర్‌ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తాం. మళ్లీ జన్మభూమి కమిటీ ద్వారా నియామకాలు ఉంటాయి’అంటూ ట్వీట్‌లో ఉంది. ఈ ట్వీట్ కొద్దిరోజులుగా వైరల్ అవుతోంది. దీంతో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఇలా వరుసగా సోషల్ మీడియాలో టీడీపీ ప్రెస్‌నోట్‌లు, ట్వీట్‌లు వైరల్ కావడంతో తెలుగు తమ్ముళ్లు అవాక్కవుతున్నారు. టీడీపీని టార్గెట్ చేస్తూ కొద్దిరోజులుగా ఇలా ఫేక్ ప్రెస్‌నోట్‌లు, ట్వీట్‌లతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పుడు ఏకంగా వాలంటీర్, సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తారంటూ ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com