ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచివాలయ వ్యవస్థని పొగిడిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ డైరెక్టర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 05, 2022, 11:34 AM

అవినీతికి ఆస్కారం లేకుండా, పారదర్శకమైన సేవలు అందించడం అభినందనీయమని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ (ఇన్వెస్టిగేషన్‌) సంతోష్‌ మెహరా అన్నారు. ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రభుత్వాన్ని ఆయన ప్రత్యేకంగా  అభినందించారు.


తొలుత సంతోష్‌ మెహరాను ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢిల్లీరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ బృందం ఎన్టీఆర్‌ జిల్లాలోని ప్రసాదంపాడు, గూడవల్లి, ఇబ్రహీంపట్నం గ్రామాల్లోని  సచివాలయాలను సోమవారం ఏపీ స్టేట్‌ హ్యూమన్‌ రైట్స్‌ సభ్యులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావుతో కలసి సందర్శించారు. కలెక్టర్‌ ఢిల్లీరావు.. సంతోష్‌ మెహరాకు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు, సచివాలయ వ్యవస్థలో పని చేస్తున్న వివిధ శాఖల వారి పనితీరును వివరించారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను బృందానికి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com