ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 05, 2022, 11:02 AM

తుంగభద్ర డ్యాంకు రోజురోజుకూ వరద పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు ప్రాజెక్టులోకి పరుగులు పెడుతున్నది. సోమవారం ఇన్ ఫ్లో 13, 505 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 298క్యూసెక్కులు నమోదైంది. తుంగభద్ర డ్యాం 105. 788 గరిష్ట నీటి నిల్వ సామ ర్థ్యానికిగానూ, ప్రస్తుతం 48. 177 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1833 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికిగానూ, ప్రస్తుతం 1814. 90 అడుగుల నీటి మట్టం ఉన్నట్లు టీబీ బోర్డు ఎస్ఈ నాగమోహన్, డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. తుంగ ప్రాజెక్టు నుంచి 17, 875 క్యూసెక్కులు టీబీ డ్యాంలోకి చేరుతున్నట్లు పేర్కొన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com