మడకశిర రూరల్: కర్ణాటకలోని పావగడ నుంచి మడకశిర మీదుగా తుమకూరుకు లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మండలంలోని ఆముదాలగొంది సమీపంలో విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. లారీలోని 166 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ ఎస్ఐ ఫణీంద్రనాథ్ రెడ్డి సోమవారం తెలిపారు. బియ్యాన్ని స్థానిక సివిల్ సప్లయ్ గోదాములో భద్రపరచి, పావగడకు చెందిన వ్యాపారి సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేశారు.