విజయవాడలో జనవాణి కార్యక్రమం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఓట్ల కోసం పనులు చేస్తుందని, తాము ప్రజల జీవితం బాగుపడే పనులే చేయాలనుకుంటాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీకి, జనసేనకు ఉన్న తేడా అదేనన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగాలు లేవని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.