ఆదివారం విశాఖ నగరంలో మాజీ ఎంపీ హర్షకుమార్ ఆధ్వర్యంలో దళితుల సింహగర్జన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల ప్రతినిధులు, దళిత మేధావులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక దళితులకు అన్యాయం జరిగిందని హర్షకుమార్ బహిరంగంగా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో కోత విధిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.