ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగం నిరంతరం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.