ఆసరా ఛారిటబుల్ సొసైటీ సేవలు అభినందనీయమని రెండవ అడిషనల్ మెట్రోపాటిటన్ మెజిస్ట్రేట్, జువనైల్ జస్టిస్ బోర్డు చైర్పర్సన్ కెవిఎల్. హిమ బిందు అన్నారు. పేరం గ్రూపు సంస్థల ఆర్ధిక సహకారంతో ఆసరా సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన షెడ్డును ప్రారంభించారు. ఆసరా ఛారిటబుల్ సొసైటీ అధ్యక్షురాలు, జువనైల్ జస్టిస్ సభ్యురాలు సి. హెచ్. సునీత మాట్లాడుతూ ప్రతి మంగళ, గురువారాల్లో పెద్ద సంఖ్యలో వస్తున్న తల్లిదండ్రులకు నీడ కల్పించేందురు పేరం గ్రూపు ఆసరా సంస్థ సమకూర్చిన రూ. 4లక్షలతో షెడ్డు, మరుగుదొడ్లను నిర్మించామన్నారు. ఆసరా ఛారిటబుల్ సొసైటీ సభ్యులు డి. సంజీవకుమార్ మాట్లాడుతూ పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని, వారి కోసం కొంత సమయం కేటాయించాలన్నారు. గడచిన నాలుగేళ్లుగా వసతిగృహంలో చేరిన విద్యార్థుల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆసరా కార్యదర్శి ఎం. రాజశ్వరి, బోని శ్రీనాధ, వసతి గృహం పర్యవేక్షణాధకారి షణ్ముఖరావు పాల్గొన్నారు.