ప్రస్తుత సమాజంలో బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించాలని లయోలా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అమల్ రాజ్ పేర్కొన్నారు. గురువారం పులివెందుల పట్టణంలోని స్థానిక లయోలా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగ ఆధ్వర్యంలో విద్యార్థులకు బాల్య వివాహాలు, పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు శ్రీనివాసులు రెడ్డి, గంగాదేవి, జువాలజీ అధ్యాపకుడు హరి ప్రకాష్ పాల్గొన్నారు.