చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్మంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పలువురు టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. చిత్తూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు ఇన్చార్జి బీద రవిచంద్ర మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షం లోఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందన్నారు.