సింగరాయకొండ: పంచాయతీలోని మల్లికార్జుననగర్ లో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభించనున్నట్లు ఎంపీడీఓ షేక్ జమీఉల్లా తెలిపారు.
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని వైసీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వరికూటి అశోక్ బాబు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ కాలనీలో సుమారు 60 మందికి ఆధార్ నమోదు చేయాల్సి ఉందని తెలిపారు.