ఎర్రగొండపాలెం: చెంచు గిరిజనుల అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రభుత్వాన్ని విమర్శించారు.
దోర్నాల మండలం మర్రిపాలెం, చింతల చెంచు గిరిజన గూడేల్లో గురువారం జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొని అన్నారు. ఇంటింటా తిరిగి ప్రభుత్వం పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.