టంగుటూరు: సాగు చేసిన నువ్వుల పంట పూత దశలో ఉందని, ఆకుచుట్టు పురుగు ఆశించినందున సస్యరక్షణ చర్యలు చేపట్టాలని గురువారం వ్యవసాయాధికారి స్వర్ణలత సూచించారు. టంగుటూరు, జమ్ములపాలెం, తూర్పునాయుడుపాలెం, ఆలకూరపాడు గ్రామాల్లో నువ్వుల పంటను పరిశీలించినట్లు ఏఓ తెలిపారు. ఎకరానికి 250 ఎంఎల్ ప్రొఫినోపాస్ పిచికారీ చేస్తే ఆకు చుట్టు పురుగు నివారించవచ్చని చెప్పారు.