ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ కు కనీస వేతనం 21వేలు ఇవ్వాలి'

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 21, 2022, 03:40 PM

దేవరాపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్టంలో మేటిరియల్ చార్జికోసం విఆర్పీల పై రాష్ట్రప్రభుత్వం మానసిక వత్తిడితెస్తుందని, ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్నపేర్కొన్నారు, శనివారం ఓప్రకటన విడుదల చేశారు. విఆర్పిలకు కనీస వేతనం 21 వేయ్యిఇవ్వాలని డిమాండ్ చేసారు, విఆర్పిలకు కనీసం వేతనం ఇవ్వాలని, ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని గురువారం గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ని వెలగపూడి లో వ్వవసాయ కార్మికసంఘం సంఘం రాష్ట్ర బృందం వినతిపత్రం ఇవ్వడం జరిందన్నారు, గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కీలక పాత్ర పోషిస్తున్న విఆర్పిలపై మానసిక వత్తిడి పెంచుతూ అతితక్కువ జీతానికి వెట్టిచాకిరి చేయించు కుంటుందని తెలిపారు.


రాష్ట్ర అభివృద్ధికి విఆర్పిలు కీలకపాత్ర పోసిస్తున్నారని అన్నారు వంద శాతం కూలీలు మట్టి పనిచేస్తే నల పైశాతం మేటిరియల్ కౌపౌండు క్రింద ప్రభుత్వం ఎకౌంట్ లో డబ్బు పడి పోతుందని తెలిపారు దీనితో రాష్ట్ర ప్రభుత్వం సచివాల యాలు రైతు భరోసా కేంధ్రాలు హెల్త్ సబ్ సెంటర్లు సి, సి రోడ్లు డ్రాయినేజిలు చేత్తతో సంపదకేంధ్రాలు పాఠశాల లుప్రహరిగోడలు, వంటి అనేక అబివృద్ది పనులు చేస్తుందని తెలిపారు, అంటే రాష్ట్రంలో ప్రత్యేకంగాను పరోక్షంగాను విఆర్పిలు ఉపాధి హామీ కూలీలు ఎంతగానో ఉపయోగపడుతున్నారని తెలిపారు, అటువంటి కూలిలకు పనిప్రదేశంలో కనీసం టెంట్లు, మంచి నీళ్లు సౌకర్యం గాని సమ్మర్ ఎలవేన్సు లాంటి కనీష సౌకర్యాలు ప్రభుత్వం కల్పించ లెదన్నారు, విఆర్పిలకు 10, 12 వేలు జీతం మించి ఇవ్వడం లేదన్నారు కూలీలుతో మేమకమై మండుటెండలో విఆర్పిలు కూలీలు చేతపని చేయిస్తున్నారనీ తెలిపారు.


మేటిరియల్ చార్జీలు కోసం మేన్ డెస్ పెంచాలని వత్తిడి చేస్తుందని, జాబ్ కార్డు ఉన్న ప్రతికూలికి పనిచే ప్పాలని, నిభందను అడ్డం పెట్టుకోని ఫీల్డ్ అస్టేంట్లు చేతవెట్టి చాకిరీ చేయించు కుంటుందని తెలిపారు, నాడు వామపక్ష ప్రజాసంఘాలు వత్తిడితో కూలీలు వలసలు నివారిం చేందుకు భూగర్భజ లాలు అభివృద్ధి చేయాలని, కూలీల ను ఆర్ధికంగా అబివృద్ది చేయాడానికి వంద రోజులు పని కల్పించాలని, పని అడిగిన పదిహేను రోజుల్లో పనికల్పిం చాలని, పని కల్పించకపోతే నిరుద్యోగ బ్రుతి చేల్లించాల ని, పనిచేసిన కూలిలకు ప్రతిపదిహెను రోజులకు బిల్లులు చేల్లించాలని, అలా చేల్లించక పోతె ప్రభుత్వం పై కూలిలకు ప్రభుత్వం పై కేసులు పెట్టుకోని అదికారం కల్పించిన చట్టం చేసిన రానురాను దీన్ని బలహీనంగా మారుస్తూ మేటిరియల్, కాపౌండు చార్జీలు పెంచుకుంటూ పోతున్నారని, ఇటు కూలిలకు కనీవేతనాలు అమలు చేయకుండా అటు విఆర్పిలకు కనీవేతనాలు ఇవ్వకుండా శ్రమదపిడీ చేస్తుందని తెలిపారు, విఆర్పిలకు కనీషవేతనం 21 ఇవ్వాలని, కూలిలకు పని ప్రదేంలో కనీస సౌకర్యాలు కల్పించాలని వెంకన్న డిమాండ్ చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com