తోమాల సేవలో శనివారం శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనానంతరం వారికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా అలయాధికారులు స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.