ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి నుంచి విదేశీ పర్యటనలో సీఎం జగన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 08:43 PM

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన రేపటి నుంచి ప్రారంభం కానుంది. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు జగన్నాథ్ విదేశీ పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు హాజరయ్యే ఏపీ ప్రతినిధి బృందానికి జగనే నేతృత్వం వహించనున్నారు.పర్యటన కోసం ఇప్పటికే నాంపల్లి సీబీఐ కోర్టు నుంచి అనుమతి పొందిన సీఎం జగన్ శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లనున్నారు.సాయంత్రం 6 గంటలకు ఆయన జ్యూరిచ్ చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరిన జగన్ బృందం శుక్రవారం రాత్రి 8.30 గంటలకు దావోస్ చేరుకుంటుంది. సీఎం జగన్ 10 రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉండనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com