ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లోకి... కేటుగాళ్లు... గుప్తనిధుల కోసమేనా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 08:27 PM

అక్కడ గుప్త నిధులు ఉన్నాయన్న సమాచారంతో రిజర్వ్ ఫారెస్ట్‌లోకి కేటుగాళ్లు రంగ ప్రవేశం చేశారు. కేటుగాడు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అనుమానం రావడంతో పోలీస్ అధికారులకు అసలు విషయం బోధపడింది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలంరేపాయి. రిజర్వ్ ఫారెస్ట్‌లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గట్టుపై 7కిలో మీటర్ల లోపల బెన్నీ ఐరన్ కోర్ మిల్స్ సమీపంలో తవ్వకాలు చేశారు. 1880వ సంవత్సరంలో బ్రిటీష్ వారి హయాంలో ఐరన్ కోర్ మిల్స్ నిర్మించారు. నిధుల కోసం పురాతన కట్టడాలను ధ్వంసం చేసి.. సుమారు 50అడుగుల లోతు తవ్వేశారు. పురాతనమైన బావిని కూడా తవ్వేసినట్లు గుర్తించారు. ఈ తవ్వకాలు జరిపిన ప్రాంతంలో బంగారం,వజ్రాలతో కూడిన భారీ నిధి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


ఈ తవ్వకాల గురించి సమాచారం రావడంతో అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు.. ఈలోపు కేటుగాళ్లు పరారయ్యారు. అడవిలో కర్రలను నరికి తయారు చేసిన నిచ్చెనని గుర్తించి అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. 10మంది ముఠా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. తవ్వకాలకు పాల్పడిన వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. పురాతన సంపదను, అడవిని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని.. అటవీశాఖ అధికారులు నిఘా పెంచాలని కోరుతున్నారు. ఈ ముఠాపై అధికారులు ఆరా తీస్తున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com