ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉదయగిరిలో బంగారు నిక్షేప గనులు... కెమెరాల నిఘాలో కేంద్రం తవ్వకాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 17, 2022, 10:23 PM

బంగారు వెండి ఇ ఈ క్షేత్రాలు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో ఉదయగిరి మాసాయిపేట కొండపై కేంద్రం తవ్వకాలను చేపట్టింది. ఈ ఖనిజ నిక్షేపాలు వెలుగు చూస్తే ఉదయగిరి మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంత వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని మాసాయిపేట కొండపై బంగారు వేట సాగుతోంది. ఈ ప్రాంతంలో భారీగా బంగారం, రాగి, వైట్‌ క్వార్ట్‌ (తెల్లరాయి) ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. అయితే, ఈ ఖనిజ నిక్షేపాలు ఎంత మేర ఉన్నాయో తెలుసుకునేందుకు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మ్యాపింగ్‌ నిర్వహించి, డ్రిల్లింగ్‌ పనులు చేపట్టింది.


ఈ నేపథ్యంలోనే జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా కొండపై ఐదు ప్రాంతాల్లో 500 నుంచి 1,000 అడుగుల మేర డ్రిల్లింగ్‌ నిర్వహించి 46 నమూనాలు సేకరించారు. ఈ ఖనిజ నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు అందజేశారు. మాసాయిపేట కొండ ప్రాంతంలో సుమారు 2,000 హెక్టార్లకు పైగా భూముల్లో బంగారం, రాగి, వైట్‌క్వార్ట్జ్ నిక్షేపాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం ఈ ఖనిజాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది.


ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌ నుంచి వచ్చిన అధికారుల బృందం.. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వాహనంతో డ్రిల్లింగ్‌ చేసే ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. 150 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ వేసిన ప్రాంతంలో భూగర్భంలోకి సీసీ కెమెరాలు పంపించి సేకరిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com