నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఘోరం జరిగింది. కాలేజీమిట్టలో చెంచు కృష్ణ అనే యువకుడు ఇంటర్ విద్యార్థి జ్యోతి (18) గొంతు కోశాడు. ప్రేమించడం లేదనే కోపంతో కాలేజికి వచ్చిన అమ్మాయి పై దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.