తిరుమల శ్రీవారిని బిజెపి ఎంపీ సుబ్రమణ్య స్వామి దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వి. ఐ. పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చినా ఆయన మీడియాతో మాట్లాడారు.