ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల వినియోగం బాగా పెరిగింది. మోసాలకు పాల్పడే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని నిందితులు... పోలీసులకు చిక్కకుండా మోసాలకు పాల్పడుతున్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న సైబర్ నేరాలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. సామాజిక మాధ్యమసంస్థలు, బ్యాంకుల నుంచి... సకాలంలో ఆధారాలు సేకరించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. ఫలితంగా సొమ్ము రికవరీ, నిందితుల అరెస్టు కష్టమవుతోంది.