చిత్తూరు జిల్లా: చంద్రగిరిలోని ఓ వీధిలో వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగుచూసింది. తమిళనాడు రాష్ట్రం అప్పలనాయుడు కండ్రిగకు చెందిన శివకుమార్ ( 45 ) గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.