ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూపాయికే ఇడ్లీ, బొండాలు..క్యూ కడుతున్న జనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 21, 2022, 11:42 AM

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలోని ఆర్బీ కొత్తూరు గ్రామంలో ఈ హోటల్ వాళ్లు రూ. 1కే 1 ఇడ్లీ, బోండాని ఇస్తున్నారు, ఈ హోటల్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టిన రేటు, నాణ్యతనే ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నారు. 16 ఏళ్ల నుంచి బయట అన్నీ రేట్లు పెరిగినా కూడా ఈ హోటల్‌లో మాత్రం టిఫిన్ రేట్ పెంచకుండా క్వాలిటీ టిఫిన్ ను అందిస్తున్నాడు. టిపిన్ షాపును నడుపుతున్న చిన్ని రామకృష్ణను అందరూ రాంబాబుగా పిలుచుకుంటారు. ఇక్కడ టిఫిన్ తినడానికి ఒక్క స్థానికులే కాదు చుట్టు పక్కల ఉన్న పది గ్రామాల ప్రజలు తెల్లారగానే రాంబాబు హోటల్ ముందు క్యూ కడతారు. కడుపునిండా తిని వెళ్తారు. తెల్లవారు జామున మూడు గంటలకే నిద్రలేచి ఉదయం 5 గంటల కల్లా వేడి వేడిగా టిఫిన్ సిద్దం చేస్తారు. దీంతో వ్యవసాయ పనులకు వెళ్ళే కూలీలు, చుట్టు పక్కల ఉన్న ఫ్యాక్టరీలో పనిచేసే సిబ్బంది తాము తిని తమ తోటి వారికోసం టిఫిన్ తీసుకుని వెళ్లారు. పదవ తరగతి ఫెయిల్ అయిన రాంబాబు మొదట్లో తన తండ్రితో పాటుగా మసాలా సామాన్లు అమ్మేవారు. ఐతే ఆ వ్యాపరం అంతగా కలిసి రాకపోవడంతో తన ఇంటి వద్దే 16 ఏళ్ళ క్రిందట చిన్న కాకా హోటల్ పెట్టుకున్నాడు.


ఈ హోటల్‌లో 2 రకాల చట్నీలతో టిఫిన్ ఇస్తారు. మొదట్లో అర్ధ రూపాయికే ఇడ్లీ ఇచ్చిన రాంబాబు ఆ తర్వాత దానిని రూపాయికి పెంచాడు. అప్పటి నుండి రూపాయికే ఇడ్లీ, మైసూర్ బొండా ఇస్తూ..నేటీకి వాటి ధరలను పెంచలేదు. రాంబాబు అందించే టిఫిన్ నాణ్యత,రుచి విషయంలో ఎక్కడా రాజీ పడడు.అందుకే ప్రతిరోజు 400 లకు పైగా కస్టమర్లు రాంబాబు టిఫిన్ కోసం ఆర్బీ కొత్తూరు వస్తుంటారు. లాభాన్ని మేనేజ్ చేస్తున్నాడు కానీ రేటుని మాత్రం పెంచలేదు. ఇలా ఎందరి కడుపులనో నింపుతున్న రాంబాబుకు హ్యాట్సాఫ్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com