కరోనా కారణంగా తిరుమల శ్రీవారి దర్శన టికెట్లలో కోత విధిస్తూ వచ్చిన టీటీడీ తాజాగా టికెట్ల సంఖ్యను క్రమంగా పెంచుతూ పోతోంది. కరోనా పరిస్థితులు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో టికెట్ల కోటాను పెంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రత్యేక దర్శన టికెట్లను మరికాసేపట్లో జారీ చేయనుంది. సోమవారం ఉదయం 9 గంటలకు టీటీడీ అధికార వెబ్సైట్లో రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులు ముందుగా వెబ్సైట్లో తమ మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.