ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 21, 2022, 11:17 AM

కరోనా కారణంగా తిరుమల శ్రీవారి దర్శన టికెట్లలో కోత విధిస్తూ వచ్చిన టీటీడీ తాజాగా టికెట్ల సంఖ్యను క్రమంగా పెంచుతూ పోతోంది. కరోనా పరిస్థితులు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో టికెట్ల కోటాను పెంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏప్రిల్‌ నెలకు సంబంధించి ప్రత్యేక దర్శన టికెట్లను మరికాసేపట్లో జారీ చేయనుంది. సోమవారం ఉదయం 9 గంటలకు టీటీడీ అధికార వెబ్‌సైట్‌లో రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులు ముందుగా వెబ్‌సైట్‌లో తమ మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నెంబర్‌తో రిజిస్టర్‌ అయిన తర్వాత టికెట్లు బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com