శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలం బొక్కునాయుడుపేట గ్రామంలో ఆదివారం శృంగవరపుకోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు ఇసుక రీచ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదవాడికి సొంత ఇంటి కల పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశారని తెలిపారు. ఇళ్ళు నిర్మించుకున్న లబ్ధిదారులు ఇసుక కొరతతో ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ప్రతి మండలంలో ఇసుక రీచ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ. జగనన్న గృహ నిర్మాణదారులు ఇసుక రీచ్ల ద్వారా ఇసుకను వినియోగించుకొని నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయాలని కోరారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలంటూ ఉండకూడదనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పానికి ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వేపాడ ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు, జడ్పిటిసి సేనాపతి అప్పారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ మూకల కస్తూరి తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.