ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 20, 2022, 11:20 AM

గ్రామ వాలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని సచివాలయాలను సందర్శించారు. ఈ సంధర్భంగా గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సచివాలయ సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్లతో మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు.


జగనన్న సంక్షేమ పథకాల అమలులో అర్హులైన ప్రతి ఒక్కరు లబ్ది పొందేలా చూడటం సచివాలయ సిబ్బంది ముఖ్య విధి అని గుర్తు చేస్తూ, ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకం వివరాలను వాలంటీర్లు ద్వారా ప్రజలకు అందజేయాలని ఆదేశించారు. పెన్షన్ అమలు విధానం, హౌసింగ్ సర్వేపై సమగ్ర వివరణ, సంక్షేమ పథకాల అమలులో వాలంటీర్ వ్యవస్త యొక్క పాత్ర సచివాలయ సిబ్బంది యొక్క సమిష్టి కృషితో గ్రామీణాభివృద్ధి సాధించడం సులభమవుతుందని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, మండల కన్వీనర్ నర్సిరెడ్డి, జడ్పీటీసీలు, వైస్ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, డైరెక్టర్లు, చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది మరియు అధికారులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com