ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తూర్పులో మంత్రి పదవులు ఎవరిని వరించనున్నాయి..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 20, 2022, 10:19 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై చర్చ జరుగుతోంది. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు మంత్రి పోస్ట్‌లో ఉంటారో కొత్తగా ఎవరికి ఛాన్స్ వస్తుందోనని వైసిపి నేతల్లో టెన్షన్‌ నెలకొంది. ఉగాదికి కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు జిల్లాకు ఓ మంత్రి చొప్పున 26 మందితో జగన్ కేబినెట్ ఏర్పాటు చేస్తారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.


మంత్రి పదవులు దక్కని వారు పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. కాగా త్వరలోనే ముహూర్తం ఉంటుందని సంకేతాలు కనిపిస్తున్న తరుణంలో కొత్త మంత్రుల లిస్ట్ ఇదే అంటూ కొందరి పేర్లు వైరల్ అవుతున్నాయి.


ఈ లిస్ట్‌లో తూర్పు గోదావరి జిల్లా నుంచి దాడిశెట్టి రాజా, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, జక్కంపూడి రాజా కొత్త మంత్రివర్గంలో ఉంటానంటూ చక్కర్లు కొడుతోంది. అయితే కేబినెట్‌లో కొత్తగా ఎవరిని తీసుకుంటారో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటన వరకు వేచి చూడాల్సిందే..!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com