మద్యానికి బానిసగా మారి భార్యతో గొడవపడి ఇంట్లో పురుగుల మందు సేవించి వాచ్మెన్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కానూరులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కానూరు మురళీనగర్ కు చెందిన సంగేటి గంగరాజు భార్య లక్ష్మీతో కలిసి అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ ఉంటున్నాడు. నిత్యం మద్యానికి బానిస అవ్వడంతో 16వ తేదీన మద్యం విషయమై భార్యభర్తుల మధ్య గొడవ జరిగింది. దీంతో తన మామకి ఫోన్ చేసి విషయాన్ని తెలిపింది. దీంతో తన తండ్రికి చెప్పుతావా అని పురుగుల మందు సేవించి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. పక్కవారి సాయంతో అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.