విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేట గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ గ్రామానికి చెందిన గోసల గోపీ ప్రియ (7) శనివారం తమ ఇంటి నుంచి ఇదే గ్రామంలో ఉన్న తమ పెద్దమ్మ ఇంటికి వెళుతుండగా నాగుపాము కాటేసింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు పాపను కాటేసిన పామును చంపేశారు. పాముకాటుకు గురైన బాలిక ను ఆస్పత్రి కి తీసుకొని వెళుతుండగా మార్గమధ్యలో చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ గారాల పట్టి కళ్లెదుటే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు దేవుడు, రత్నం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారిని అక్కడున్న వారెవరూ ఓదార్చలేకపోతున్నారు. ఈ బాలిక గ్రామంలోని పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నట్లు హెచ్ఎం చలపతిరావు మాస్టారు చెప్పారు. పాప మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.