విజయనగరం జిల్లా: కొమరాడ మండలం జంఝవతి డ్యాం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డ్యాం కు వెళ్లే మార్గంలో బైక్ అదుపు తప్పి పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు ఇద్దరు కొమరాడ మండలం కల్లికోట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.