మండల కేంద్రమైన మాడుగుల బస్టాండ్ ఆవరణలో శనివారం టిడిపి ఆధ్వర్యంలో సారాయి మద్యం అమ్మకాలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పి వి జి కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అక్రమ నాటు సారా అమ్మకాలు వల్ల ప్రజా ఆరోగ్యం తీవ్రంగా నాశనం అవుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మద్యపానాన్ని అరికడతామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు రాష్ట్రంలో మద్యం అమ్మకాలలో కొత్త కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
అక్రమ సారాయి రాష్ట్రంలో ఏరులై పారుతుంది అన్నారు. దీనిని తక్షణం అరికట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి సారాయి కి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.