పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో సారా మరణాల పై సమగ్ర విచారణ జరిపించాలని చిత్తూరు తెలుగుదేశం పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా టిడిపి కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సారా తాగడం వల్లే 26 మంది మృతి చెందగా సహజ మరణాలు అని చెబితే ప్రభుత్వం నుంచి సాయం అందిస్తారని అధికారులు చెప్పమన్నారని బాధితులు చెబుతున్నారు.
సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ మంత్రి నియోజకవర్గంలోని సారా ఏరులై పారుతుందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు. ఈ సమావేశంలో చిత్తూరు పార్లమెంటు తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి లక్ష్మీప్రసన్న , నేతలు నాగరాజు, లత, శ్రీ దుర్గా, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.