వైసీపీ ప్రభుత్వం వన్ బై అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల జాడేలేదని చిత్తూరు తెలుగుదేశం పార్టీ మహిళ శ్రేణులు మండిపడ్డారు. శుక్రవారం చిత్తూరు నగరం తేనె బండలో గౌరవ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి ఎమ్మెల్యేలు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వస్తారని , ఇంతకాలం ప్రజలకు ముఖం చాటేసి ఇసుక గ్రైనేట్ అక్రమ రవాణా సారా వ్యాపారం భూదందాల తో వైసీపీ నేతలు కాలం గడపడం పై ఫైర్ అయ్యారు ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి మహిళా నాయకురాలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.