ఆళ్లగడ్డ నియోజకవర్గ రుద్రవరం ఉయ్యాలవాడ మండలంలోని సర్వాయిపల్లె గ్రామానికి చెందిన బెల్లం సంధ్య అనే యువతి అదృశ్యం అయినట్లు ఏఎస్సై రామక్రిష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి పోయిందన్నారు.
బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదని యువతి తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు చేశారన్నారు. అదే గ్రామానికి చెందిన కోడూరు శివకుమార్పై అనుమానం ఉన్నట్లు ఆమె తెలిపారు. బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.