జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలంలోని సిరిగే పల్లె విసి గోపాల్ (40) అదృశ్యమయ్యాడు. గతనెల 16న గోపాల్ ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదని వారి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపాల్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎవరికైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని తాళ్ల పొద్దుటూరు ఎస్సై రవి కుమార్ తెలిపారు. ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.