మహానంది క్షేత్రంలో గురువారం నిర్వహించిన బహిరంగ వేలాల ద్వారా రూ. 1. 38 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. పోచా విశ్రాంతి భవనంలో పాలకమండలి చైర్మెన కొమ్మా మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బహిరంగ వేలాలను నిర్వహించారు. దేవస్థానానికి చెందిన రెండు టోల్గేట్ల వద్ద రుసుం వసూళ్ళు చేసుకొనే హక్కును బొల్లవరం గ్రామానికి చెందిన బండి నారాయణ రూ. 1. 33 కోట్లకు వేలం ద్వారా దక్కించుకొన్నట్లు తెలిపారు. అలాగే వాహన పూజల లైసెన్సను చెరుకుచెర్లకు చెందిన రాజలింగేశ్వరయ్య రూ. 3. 75 లక్షలకు, దేవస్థానం కార్యాలయం పక్కన ఖాళీ స్థలంలో ఏడాది పాటు హోటల్ నడిపేందుకు నెలకు రూ. 15 వేలకు మహానందికి చెందిన మునగనూరి రమేష్ దక్కించుకొన్నట్లు చెప్పారు. చింత ఫలసాయం రూ. 5వేలకు బహిరంగవేలం ద్వారా తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూపు దేవాలయాల ఇనస్పెక్టర్ కిరణ్కుమార్రెడ్డి, ఏఈవో ఎర్రమల్ల మధు, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, శశిధర్రెడ్డితో పాటు పాలకమండలి సభ్యులు పాల్గొనగా మిగిలిన వాటికి దేవదాయశాఖకు అనుకున్నంత కాంట్రాక్టర్లు పాడకపోవడంతో వాయిదా వేశామని ఈవో తెలిపారు.