డిల్లీలో రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు క్యాంపు కార్యాలయంలో బీజేపి నేత మరియు కాపు సంఘం నాయకులు కరణంరెడ్డి నరసింగరావు ఆద్వర్యంలో ఎం. పి జివిఎల్ ని కలసి తూర్పు కాపులను బిసి - ఎ లో చేర్చాలని కోరుతూ వినతిపత్రం అందజేసిన తూర్పుకాపు సంఘం నాయకులు మజ్జి అప్పారావు గొర్లె శ్రీనివాసునాయుడు గొర్లె నాగార్జునబాబు తదితరులు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని పార్లమెంటులో ఈ విషయం లేవనెత్తి తూర్పు కాపులను బిసి-ఎ చేర్చడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారని, ఈ సందర్బంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.