ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నందు జరుగుతున్న 67 వ వార్షికోత్సవ తిరునాళ్ళ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి దంపతులు మరియు జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ లు పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. తొలుత వేదపండితులు మంత్రి దంపతులను సాదరంగా ఆహ్వానించి చర్చలు జరిపి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం మంత్రి దంపతులను, జడ్పీ చైర్మన్ ను సత్కరించారు