పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం వద్ద అగ్గిపెట్టెల లోడు లారీ దగ్ధం మైంది. అయితే విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రెండు ఫైరింజన్లు తో మంటలను అదుపు చేసారు. తమిళనాడు నుండి బీహార్ వెళ్తున్న అగ్గిపెట్టె లోడు లారీ పెందుర్తి దాటుతుండగా అగ్నిప్రమాదం సంభవించిందని స్థానికులు అంటున్నారు. ఎదురుగా వస్తున్న వాహనం అగ్గిపెట్టెలో లారీని తగులుకొని వెళ్లడంతో ఆ రాపిడి కి లారీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన లారీ డ్రైవర్ క్లీనర్ లారీ నుంచి దిగిపోయారు. ఈ సంఘటన పెందుర్తి ఆనందపురం ప్రధాన రహదారిపై జరగడంతో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.