ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద శుక్రవారం నుంచి జిల్లాలో ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లు డీఎస్ఓ కార్యాలయ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 11. 46 లక్షల కార్డుదారులకు. ఐదేసి కిలోల చొప్పున చౌక దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేస్తారన్నారు. కోవిడ్ లో భాగంగా కేంద్రం ప్రారంభించిన ఈ ఉచిత బియ్యం పంపిణీ ఈ నెలాఖరుతో ముగుస్తుంది అన్నారు.