ఆదోని పట్టణంలోని కిల్చిన్పేటలో హోలీ సంబరాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. గురువారం గజ వాహనంపై మన్మథుని ఊరేగించే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని తిలచించేందుకు ఆదోని నలుమూలల నుంచి వేలాది మంది జనం తరలి వచ్చారు. గోడలపై నుంచి ఉత్సవ దృశ్యాలను వీక్షిస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా ఓ గోడ కూలి దానిపై నిలుచున్న వీరాబాయి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించినట్లు బంధువులు తెలిపారు.