విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి లో సంచలనం సృష్టించిన పసికందు అపహరణపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈమేరకు ఎయిర్ పోర్టు పోలీసు లు పలు ఆస్పత్రుల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎయిర్ పోర్టు సి. ఐ సి. హెచ్ ఉమాకాంత్ నేతృత్వంలో ఎస్. ఐ విజయ్ కుమార్ గురువారం మర్రిపాలెం, ఎన్. ఏడీ కూడలి, బుచ్చి రాజుపాలెం తదితర ప్రాంతాల్లో ఆస్పత్రి నిర్వహకులను ప్రశ్నించారు. గుర్తు తెలియని మహిళలిద్దరు నాలుగు రోజుల పసికందును కేజీ ఆస్పత్రి లో అపహరించినట్లు వివరించారు. రోజుల పసికందు కావడంతో పసికందు కు ఎదైనా ఆస్పత్రిలో చికిత్స అందించే ఆవకాశం ఉంటుందని దింతో ఆస్పత్రుల్లో విస్తృత తనిఖీలు చేపటినట్లు వెళ్లడించారు. ఆస్పత్రి పరిసరాల్లో అనుమానితులు సంచరించిన పసికందు ను ఎవరైన గుర్థిస్తే తక్షణం పోలీసు లకు సమాచారం ఇవ్వాలని కోరారు.