ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల్లూరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 17, 2022, 03:23 PM

కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ప్రైవేటీకరణను నిరసిస్తూ నెల్లూరు జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని నర్సింగ్‌పట్నం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ జరిపారు. ప్రైవేటీకరణకు ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని టీడీపీ నేత సోమిరెడ్డి తెలిపారు. దేశంలో మొట్టమొదటగా 21వేల కోట్ల నిర్మించిన 204 మెగావాట్స్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ప్రైవేట్‌పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.రూపాయి పెట్టుబడి లేకుండా అదాని కంపెనీకి 25 సంవత్సరాలు అప్పగించడం అన్యాయమని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌పై వేలాది మంది ఆదారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. సీపీఐ నాయకుడు నారాయణ మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును అన్యాయంగా అమ్ముకుంటున్నారని అన్నారు. మోదీకి దత్తపుత్రుడు అదాని అయితే అదాని దత్తపుత్రుడు జగన్‌ మోహన్‌రెడ్డి అని విమర్శించారు. అనంతరం అఖిలపక్ష నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com