గూడూరు మండల పరిధిలోని పాలిచెర్ల రాజుపాలెం బస్ షెల్టర్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. గ్రామంలోని బస్ షెల్టర్ సమీపంతో అచేతనంగా పడిఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు.
మృతుని వయసు సుమారు 55 ఉంటుంది. తెలుపు రంగు చొక్కా, బ్లూ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. రూరల్ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాధమిక సమాచారం మేరకు మృతుడు చెన్నైకి చెందిన జాన్ అని, అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడనే విషయం విచారణలో తేలాల్సి ఉంది.