తూర్పు గోదావరి: రాజోలు మండలం బి. సావరం గ్రామంలో గురువారం రెండు ఆంబోతులు వీరంగం సృష్టించాయి. ఒకదానిపై, మరొకటి పొట్లాడుతూ ప్రజలకు భయబ్రాంతులకు గరిచేశాయి. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఓ వాహనదారుడు బైక్పై నుంచి పడి గాయాల పాలయ్యాడు. స్థానికులు వాటిని చెదరగొట్టే ప్రయత్నం చేసినా ఆంబోతులు అదరకపోగా, జనం మీదకి వచ్చాయి. భయంతో ప్రజలు పరుగులు తీశారు. ఆంబోతులు వీరంగంతో ప్రజలు ఆందోళన చెందారు.