తూర్పు గోదావరి: రాజోలు మండలంలో ఉన్న వికలాంగులకు థి గాడ్స్ వే ఆర్గనైజేషన్ సమకూర్చిన ట్రై సైకిళ్లు ను గురువారం రాజోలు లో పంపిణీ చేశారు. ధి గాడ్స్ వే ఆర్గనైజేషన్ వ్యవస్థపకులు టి. స్పర్జన్ కింగ్ చేస్తున్న సేవలను పలువురు కొనియాడారు. కొవిడ్ మొదటి, రెండవ దశలలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి తన సేవా గుణాన్ని చాటారని లబ్ధిదారులు అంటున్నారు.